టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపొందిన
బాహుబలి సినిమా ఎంతటి స్థాయిలో
చరిత్ర సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో
ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ
సినిమా వసూళ్ల పరంగా నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ
సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూడేళ్లు ఈ సినిమానే ట్రెండ్ అయ్యింది అంటే ఎంతటి స్థాయిలో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా వసూలను సాధించిన ఈ
సినిమా స్థాయిలో ఇంతవరకు ఏ
సినిమా కూడా రూపొంద లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నా మాట.
ఎప్పటికప్పుడు
బాహుబలి సినిమాలా మా చేస్తున్నామని అందరూ కూడా చెప్పుకోవడమే తప్ప అలాంటి సినిమాను చేయకుండా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతూ కొంతమంది తమ పరువు తీసేసుకున్నారు. ఆ విధంగా తమిళనాడులో రూపొందిన పోన్నియన్ సెల్వన్ చిత్రం కూడా
బాహుబలి సినిమాతో కంపేర్ చేయడం ఆ చిత్రంపై ట్రోల్స్ పెరగడానికి కారణం అవుతుంది.
విక్రమ్ కార్తీ
జయం రవి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించడం ఈ సినిమాపై ఎంతటి స్థాయిలో బజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం.
అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసే విధానంలో చిత్ర బృందం తప్పు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో తమ
సినిమా పేరును చెప్పుకుంటే పర్వాలేదు కానీ దానిని
బాహుబలి తో కంపేర్ చేయడమే ఆ సినిమాకు త్రొల్ జరుగుతుంది. ప్రతి సినిమాలో బాహుబలితో కంపేర్ చేయడం ఆ తర్వాత అంతటి స్థాయిలో ఏ
సినిమా కూడా లేకపోవడం జరగడమే ఈ విధంగా ట్రోల్ జరగడానికి కారణం అని చెప్పాలి. ఈ సినిమాలో
తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు నటిస్తున్నారు.
ఐశ్వర్య రాయ్
త్రిష లాంటి పెద్ద
హీరోయిన్ లు నటిస్తున్నారు. ఈ క్రమంలో వారి ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేస్తే ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుంది అని
బాహుబలి ఫ్యాన్స్ చెప్పే మాట.