పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు మూవీ లకు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ మూవీ ని తెలుగు లో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా శృతి హాసన్మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ తో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ లో నటించాడు.

మూవీ లో దగ్గుపాటి రానా కూడా హీరోగా కనిపించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ దాదాపుగా భీమ్లా నాయక్ మూవీ తో పాటే హరిహర వీరమల్లు మూవీ ని కూడా ప్రారంభించాడు. కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ మూవీ పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ తమిళ మూవీ వినోదయ సీతం ని తెలు గులో రీమేక్ చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అలాగే ఆ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ పై మాత్రమే తన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొని ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: