బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా , ఆలియా భట్మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల అయ్యింది.

విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి  బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్ లభించాయి. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరిగింది. ఈ మూవీ 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజులకు బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.30 కోట్ల షేర్ , 11.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో బ్రహ్మాస్త్రం మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఈ మూవీ రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: