టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా , శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి , వెన్నెల కిషోర్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యింది.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని , ప్రస్తుతం మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం కంటే ముందు వరస అపజాలతో బాక్సా ఫీస్ దగ్గర డిలా పడిపోయి ఉన్నా  శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ తో తిరిగి మళ్ళీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన రీతు వర్మ కూడా వరస అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొంటూ వస్తుంది. రీతు వర్మ కూడా ఒకే ఒక జీవితం మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఒకే ఒక జీవితం మూవీ తో ఇటు శర్వానంద్ అటు రీతూ వర్మ ఇద్దరు కూడా మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తిరిగి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: