రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం RC -15 . ఈ చిత్రాన్ని కేవలం టైటిల్ వర్కింగ్ మాత్రమే పెట్టారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగతోంది. దీంతో  ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నది. డైరెక్టర్ శంకర్ తన సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా పగడ్బందీగా తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా కోసం భారీ ప్లాన్స్ వేసినప్పటికీ ఇందులో భాగంగా భారీ క్యాస్టింగ్ ఉండేలా పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా లోకి విలక్షణమైన నటుడు ఎస్ జె సూర్య కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం ఇంతవరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్ వేదికకు ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఈ విషయంపై ఎస్ జె సూర్య స్పందిస్తూ.. తను బాల నటుడిగా  ఉన్నప్పుడు నుంచి తాను శంకర్ గారిని చూస్తున్నాను స్నేహితుడు సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కూడా అదే ఎనర్జీ కనిపిస్తోందని తెలిపారు. ఇక ఒక అభిమానిగా నటుడుగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్ అంటూ ఒక ట్వీట్ రాసుకోచ్చారు. దీంతో మరిన్ని అంచనాలు ఈ సినిమా పైన పెరగడం జరుగుతోంది. ఈ సినిమా అసలు కథ ఏంటి రాంచరణ్, శంకర్ ఎలా మ్యాజిక్ చేయబోతున్నారు తెలియాలి అంటే మరో కొద్ది రోజులు వేచి ఉల్లాల్సిందే.. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: