టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ నందమూరి అభిమానులను ఇంకా సాధారణ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు తనయుడి సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఓపెన్ అవ్వలేదు. గతంలో ఓసారి బాలయ్య తానే స్వయంగా ఆదిత్య369 సీక్వెల్‌ను తెరకెక్కిస్తానని ఆ తోనే మోక్షజ్ఞను లాంచ్‌ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత మళ్లీ మోక్షజ్ఞ డెబ్యూ గురించి చర్చ జరగలేదు. అయితే తాజాగా మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై చర్చ ప్రారంభమైంది.తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ కాన్ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది. తనయుడిని గ్రాండ్‌గా లాంచ్‌ చేసే బాధ్యతను బాలయ్య ఓ యంగ్‌ డైరెక్టర్‌కు అప్పజెప్పారని చర్చ జరుగుతోంది. టాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్‌ వంటి చిత్రాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ కు దర్శకత్వం వహించనున్నాడని టాక్‌ నడుస్తోంది.


అంతేకాదు మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ ఒక అద్భుత కథను సిద్ధం చేసుకున్నాడని సమాచారం.ఇప్పటికే మోక్షజ్ఞ, బాలకృష్ణలతో కథ గురించి చర్చించిన రాహుల్‌ వారి నుంచి కు గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది.? ఈసారైనా మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ పక్కాగా ఉంటుందా.? అన్న విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నిజంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తను ఎంట్రీ తన తాత, నాన్న, అన్న లగా అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తన 107 వ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 వ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: