దర్శకధీరుడు రాజమౌళి ఈ సంవత్సరం ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా నటించగా , ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో అజయ్ దేవ్ గన్ , శ్రేయ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించగా , ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు.  

ఇది ఇలా అంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించ బోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో రాజమౌళి తలకెక్కించే మూవీ భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రాజమౌళి , మహేష్ బాబు మూవీ షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్క బోయే భారీ బడ్జెట్ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 26 వ తేదీ న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళిసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి దర్శకదిరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు. ఈ మూవీ ని ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీ గా తేరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: