సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గీత గోవిందం ఫెమ్ పరశు రామ్ దర్శకత్వం వహించగా , మహానటి కీర్తి సురేష్మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. తమన్మూవీ కి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.

కొన్ని రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలాగే  మంచి కలెక్షన్ లను కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న సర్కారు వారి పాట మూవీ కొన్ని రోజుల క్రితం నుండే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా మంచి ఆదరణను తెచ్చుకుంది.

ఇలా థియేటర్ మరియు 'ఓ టి టి' ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సర్కారు వారి పాట మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయ్యింది.  సర్కారు వారి పాట సినిమా స్టార్ మా చానల్లో మరి కొన్ని రోజుల్లో ప్రసారం కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని , ఆ తర్వాత 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను అలరించిన సర్కారు వారి పాట సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: