హీరో గోపీచంద్ ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను పూర్తి స్థాయి లో అలరించలేకపోతున్నాడు ఈ హీరో. దాంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలని ఆయనకు ఇప్పటికే రెండు హిట్ సినిమాలను అందజేసిన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి మూడో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. అయితే ఎక్క‌డైనా స‌క్సెస్ ఉంటేనే విలువ‌. మరీ ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో సక్సెస్ ఉన్న వారికి అయితే ఈ మాట ఇంకా బాగా సూట‌వుతోంది. వారు చెప్పిందే నడుస్తుంది. అలా ఇప్పుడు దేశవ్యాప్తంగా సక్సెస్ అయినా చాలామంది హీరోలు ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు.

అయితే గోపీచంద్ మాత్రం సక్సెస్ కోసం పాకులాడుతూ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో ఓ ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధం అవుతుండడం అయన అభిమానులను కలవరపరుస్తోంది. మారుతి దర్శకత్వంలో అయన ఇప్పటికే పక్కా కమర్షియల్ అనే ఓ ఫ్లాప్ సినిమా చేశాడు. అయితే మారుతి కి అంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమా నే ఉంది. శ్రీవాస్ కూడా గత సినిమా ఫ్లాప్ చేశాడు. అలా ఇప్పటికే ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్ లతో చేసిన గోపీచంద్ ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ ను ఎంచుకున్నాడు. ఆయనే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌. అయన సినిమాలలో మంచి కామెడీ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది కానీ అయన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఏ హీరో కూడా ఆయనను నమ్మలేదు.

ఫలితంగా ఆయనతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. మరి ఇప్పుడు చేస్తున్న ఈ గోపీచంద్ సినిమా తోనైనా అయన పెద్ద విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. అయితే ఈ దర్శకుడు ఇప్పటికే మంచు విష్ణు హీరో గా ఓ సినిమా ను ఒకే చేశాడు. అది ఎందుకు పూర్తిగా పక్కన పెట్టేశాడు. మంచు విష్ణు కూడా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. జిన్నా అనే పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే విడుదల కాబోతుంది. మరి ఇటు గోపీచంద్, అటు శ్రీనువైట్ల ఇద్దరు విజయపు బాటలో నడవాలంటే తప్పకుండా మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: