తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరో గా తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వారసుడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో పెట్టుకున్నారు విజయ్ దళపతి అభిమానులు.

తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తున్నాయి. కారణం ఏదైనా విజయ్ దళపతి సినిమా కి ఈ స్థాయి లో వార్తలు రావడం సినిమా పై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాలి.  ఈ సినిమా ఓటీటీ రైట్స్ తాజాగా  అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన వార్తలు బాగా వస్తున్నాయి.  భారీ మొత్తానికి అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్టు సమాచారం. ఇటీవలే కాలంలో పెద్ద హీరోల సినిమా యొక్క ఓటీటీ లు ముందుగానే అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదల కు ముందే టేబుల్ ప్రాఫిట్ పొందుతున్నారు మన నిర్మాతలు. ఆ విధంగా ఈ సినిమా కి వచ్చిన ఓటీటీ రైట్స్ తో సినిమా లాభాల బాటలో నడుస్తుందని చెప్పాలి.

ఓవరాల్ గా ఓటీటీ రైట్స్ ని అమెజాన్‌ ఏకంగా 60కోట్లకు దక్కించుకుందని సమాచారం. దీని బట్టి ఇది ఈ సినిమా కు భారీ మొత్తం అని చెప్పాలి. సినిమా ప్లాప్ హిట్ లతో సంబంధం లేకుండా వారు ఈ విధంగా ముందే కొనుగోలు చేయడం నిజంగా ఎంతో గ్రేట్ అని చెప్పాలి. మరోవైపు శాటిలైట్‌ రైట్స్ కూడా షాకిచ్చేలా పలికిందట. దీనికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌ టీవీ ఏకంగా యాభై కోట్లు వెచ్చించిందని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.  అలాగే మ్యూజికల్‌ రైట్స్‌ ని టీ సిరీస్‌ పది కోట్లకి కొనుక్కుందని సమాచారం.ఇలా ఈ సినిమా రైట్స్ రూపంలోనే లాభాలను అందుకోవడం విశేషం.మరి సినిమా హిట్ అయితే ఆ సినిమా ద్వారా వచ్చే లాభాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం ఖాయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: