ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వపడే సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ వరుస సినిమాలలో నటించడం ద్వారా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు.అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు. ఆదివారం రోజున సౌందర్య పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు.సౌందర్యకు ఇప్పటికే వేద్ కృష్ణ పేరుతో ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆదివారం రోజు జన్మించిన మగబిడ్డకు ఇప్పటికే నామకరణం చేయగా వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ పేరు వైరల్ అవుతుండగా రజనీకాంత్ పేరు కలిసొచ్చేలా పేరు పెట్టడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా చేయడం జరిగింది.దేవుడి దయ, తల్లీదండ్రుల ఆశీర్వాదాలతో వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడికి స్వాగతం పలుకుతున్నామని సౌందర్య అన్నారు. 


ఈ సందర్భంగా సౌందర్య డాక్టర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. సౌందర్య చేసిన పోస్ట్ కు ఇప్పటివరకు 6000కు పైగా లైక్స్ వచ్చాయి.మూడేళ్ల క్రితం సౌందర్య రెండో పెళ్లి చేసుకోగా ఈ మగబిడ్డ సౌందర్యకు, రెండో భర్తకు జన్మించిన బిడ్డ కావడం గమనార్హం.సౌందర్య పలు సినిమాలకు డైరెక్టర్ గా పని చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. డైరెక్టర్ గా ఇప్పటివరకు సరైన సక్సెస్ లేకపోయినా ఆమెకు సినిమా ఆఫర్లు మాత్రం పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సౌందర్య కెరీర్ విషయంలో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇక రజినీకాంత్ ప్రస్తుతం బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: