టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ యూత్ కి బాగా పరిచయం ఉన్న పేరు .. ఈ పేరు చెప్తే జనాలు పూనకాలు వచిన్నట్లు ఊగిపోతారు. ఒకే ఒక్క సినిమాతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ .

అంతకుముందు పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో బీభత్సం సృష్టించాడు. అంతేకాదు ఈ సినిమాలకు ముందు  కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసినా.. పెద్దగా మెప్పించలేకపోయిన విజయ్ దేవరకొండ ..అర్జున్ రెడ్డిలో చూసి ఇంతటి మంచి నటుడున్నా మనం రిజెక్ట్ చేసుకున్నింది అని జనాలు ఫీల్ అయ్యేలా చేసాడు విజయ్...

అంతేకాదు అర్జున్ రెడ్డి తర్వాత ప్రతి కుర్రాడిలోనూ అర్జున్ రెడ్డి తయారయ్యాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కాగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన లైగర్ మూవీ తో ఆ పేరు డబుల్ చేసుకుందాం అనుకున్న విజయ్ దేవరకొండకు నిరాశే మిగిలింది. డైరెక్షన్ పరంగా బాగోలేక లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై పూరి జగన్నాధ్ పై విపరీతమైన ట్రోల్స్ చేశారు ట్రోలర్స్….

అంతేకాదు వీళ్ళ కాంబోలో రాబోతున్న మరో సినిమా 'జనగణమన' కూడా ఇలాగే ఉంటుందని ..దయచేసి విజయ్ ను ఈ సినిమా నుంచి తప్పుకోమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . రీసెంట్ గా సైమా ఫంక్షన్ కి అటెండ్ అయిన విజయ్ దేవరకొండ ను మీడియా జనగణమన గురించి ప్రశ్నించగా,ఈ క్రమంలోనే విజయ్ ఆన్సర్ షాకింగ్ గా అనిపించింది. మీడియా ఆయనతో మాట్లాడుతూ జనగణమన పై ప్రశ్న వేసింది. దీనికి విజయ్ మాట్లాడుతూ.." మనం వచ్చింది సైమాకి.. సైమాని ఎంజాయ్ చేస్తే చాలు.. ఒకే "అంటూ ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.

అంతేకాదు ఇప్పటికే జనగణమన ప్రాజెక్టు నుంచి మై హోమ్ గ్రూప్ సంస్థ తప్పుకున్నట్లు తెలుస్తుంది ..అంతే కాదు విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు జనాలు. జనగణమన పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఓసారి మహేష్ బాబు తో ఆగిపోయింది ..ఇప్పుడేమో విజయ్ దేవరకొండతో ఆగిపోయింది .. మరి పూరి తన మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాల్సిందే..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు జనాలు

మరింత సమాచారం తెలుసుకోండి: