సౌత్ ఇండియా సినీ ప్రముఖులు సైతం ఎంత ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల వేదిక రెండు రోజుల క్రితం అంగ రంగ వైభవంగా జరిగింది. అయితే ఈ అవార్డు వేడుకలలో మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు సైతం అక్కడ స్టార్స్ గా నిలిచారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఈ అవార్డులను ఎంపిక కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు కానీ ఏకంగా ఆరు అవార్డులను సైతం దక్కించుకున్నది. దీంతో మొత్తం అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి . ఇక అంతే కాకుండా హీరోయిన్ పూజ హెగ్డే కూడా రెండు అవార్డులను సైతం చేసుకోవడం తో అక్కడ చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు.ఒక సైమా అవార్డు దక్కడం గొప్ప విషయం అనుకుంటే ఈమెకు ఏకంగా రెండు అవార్డులో రావడం చాలా విశేషమని చెప్పవచ్చు. మొదట ఉత్తమ హీరోయిన్ కేటగిరిలో పూజా హెగ్డే అవార్డును అందుకున్నది అంతేకాకుండా యూత్ ఐకాన్ ఫిమేల్ క్యాటగిరిలో కూడా ఈ ముద్దుగుమ్మ మరొక అవార్డును తీసుకుంది. ఈ రెండు అవార్డులు తీసుకున్న ఆనందంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ఆమె అభిమానులు కూడా ఈమెకు రెండు అవార్డులు రావడంతో చాలా సంబరపడిపోతున్నారు.
అవార్డు తీసుకొనే సమయంలో పూజ హెగ్డే గురించి వేసిన ఏవిలో ఆమె పైన సైమా వారు ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. వరుస ప్లాప్ లు వచ్చినా కూడా ఇమే కు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వాటితోపాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంటోంది బుట్ట బొమ్మ. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: