మెగాస్టార్ చిరంజీవి తన ముగ్గురు పిల్లలు యొక్క ఫోటోలను ఎప్పుడూ షేర్ చేస్తే ఆనందపడుతూ ఉంటారు రాంచరణ్ సుస్మిత మరియు శ్రీజ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని తాజాగా పంచుకున్నారు. తమ పిల్లలందరూ ఇలా ఒక్క దగ్గర ఉల్లాసంగా ఉంటే తమ తల్లిదండ్రులకు కలిగే ఆనందమే వేరే ఉన్నట్టుగా ఈ ఫోటోతో చిరంజీవి కామెంట్స్ చేయడం జరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతొంది.

రెగ్యులర్ గా తమ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో మెగా ఫ్యామిలీ ఇలా కలుస్తూనే ఉంటుంది. అయితే వీటినలో ముగ్గురు ఇలా కనిపించడంతో చిరంజీవికి చూడడానికి చాలా ఆనందం కలిగినట్టుగా అనిపించడంతో..అందుచేతనే ఈ ఫోటోను షేర్ చేయడం జరిగింది. రామ్ చరణ్ మరియు ఇతర సోదరులతో కలిసి ఉన్న ఈ ఫోటో చాలా రేర్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోటో మీద అభిమానులు సైతం  నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం బాబీ డైరెక్షన్ల ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రానికి వాల్తేర్ వీరన్న అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తన 15వ సినిమాకు సంబంధించి షూటింగ్లో పాల్గొన్నారు. ఇక సుస్మిత తన తండ్రి మరియు సోదరుడు సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా వ్యవహరిస్తూ ఉన్నది. నీకు అంతే కాకుండా నిర్మాతగా కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది శ్రీజ కూడా సినీ రంగంలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: