గతకొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ హీరో గా నటించబోయే సినిమా పై రకరకాల వార్తలు హల్చల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎవరు కూడా స్పందించకపోవడం సినిమా గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లైగర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడం ఒక్కసారిగా అందరిని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి నోరు విప్పడం అందరిలో ఎంతో ఆసక్తి ని రేకెత్తించింది. ఈ ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండను కొంతమంది మీడియా ప్రతినిధులు ‘జనగణమన’ చిత్రం ఏమైందని ప్రశ్నించారు.

ఇది ఆయనను ఇబ్బంది కలిగించే ప్రశ్నే అయినా హీరో నే స్వయంగా రావడంతో దీని గురించి అడిగారు అని చెప్పాలి. అయితే దీనికి విజయ్ దేవరకొండ కాస్త వెరైటీ గా స్పందించారని చెప్పాలి. దీనికి ఆయన స్పందిస్తూ.. సైమా వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని భావిస్తారని, కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోవాలని సమాధానమిచ్చారు. ఏదేమైనా విజయ్ దానికి సమాధానం ఇవ్వడటానికి నిరాకరించినట్లు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సినిమా ఇక లేదన్న చర్చ మొదలైంది. పురీ జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ అయినా ఈ ‘జనగణమన’ లైవ్‌లోనే ఉండి ఉంటే విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని చెబుతున్నారు.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది. ఇకపోతే ‘జనగణమన’ పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు. ఈ సినిమా ను చేయడానికి అయన చాలా ట్రై చేశారు.  ఆరేళ్ల క్రితమే పూరి దీని గురించి ప్రకటించారు. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. కారణం ఏంటో తెలియదు కానీ  తొలుత మహేశ్‌బాబును ఈ సినిమా ను ఒప్పుకోగా వివిధ కారణాలతో ఆయన దీని నుంచి తప్పుకున్నారు. దాంతో మరో సరైన హీరో కోసం ఎదురుచూసిన పూరీ విజయ్ తో సినిమా చేయాలనీ భావించగా అది కూడా మధ్య లోనే ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: