దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక బంగారం లాంటి ఛాన్సును మిస్స్ చేసుకున్నాడు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన హీరోతో ఒక ఫ్లాప్ సినిమాను రూపొందించి ఇటు హీరోతో పాటు తాను కూడా ఆబాసపాలయ్యాడు. కారణం ఏదైనా కూడా వారు ఎంతగానో నమ్మిన లైగర్
సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మేప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు ఇద్దరూ కూడా మరొక భారీ సినిమాతో కం బ్యాక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. హీరో
విజయ్ దేవరకొండ ఇప్పటికే తన తదుపరి
సినిమా యొక్క షూటింగ్ ను సగభాగం పూర్తి చేశాడు.
పూరీ నే ఇప్పుడు ఏ
సినిమా చేయాలో అన్న సందిగ్ధతలో ఉన్నాడు. వాస్తవానికి ఈ సినిమాను విడుదల చేయకముందే జనగణమన అనే తన డ్రీమ్ ప్రాజెక్టును
విజయ్ దేవరకొండతో మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు ఆ
సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో
పూరి జగన్నాథ్ ఏ
సినిమా చేస్తాడు అన్న ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత ప్రేక్షకులను నిరాశపరిచే సినిమాలు చేశాడు. ఆ విధంగా చాలా కష్టాల్లో ఉన్న సమయంలో
ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన
పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల మధ్య లైగర్ సినిమాను చేశాడు కానీ అది ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆయనకు మరొక
ఇస్మార్ట్ శంకర్ లాంటి
సినిమా హిట్
సినిమా అవసరం ఏర్పడింది.
మరి ఇప్పటికే
పూరి జగన్నాథ్ లో సత్తా అయిపోయింది అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయన అలాంటి సినిమాను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకోగలడా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం
ఇస్మార్ట్ శంకర్ రెండవ భాగం
సినిమా పైన ఆయన పూర్తి దృష్టి సారించారని తెలుస్తుంది. త్వరలోనే
ముంబై నుంచి హైదరాబాద్కు మతం
మార్చి ఈ
సినిమా యొక్క కథపై కూర్చోబోతున్నారట. మరి ఇప్పటికైనా తనలోని పాత
పూరి జగన్నాథ్ ను నిద్ర లేపి మంచి సినిమాలను రూపొందించి అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు. ఇటు
విజయ్ దేవరకొండ కూడా ఈ
సినిమా ద్వారా నేర్చుకున్న పాఠంతో మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా మంచి సినిమాలను చేయాలని భావిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న
ఖుషీ సినిమాను
డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.