టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. సమంత కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుంది అని చెబుతున్నారు. ఆ విధంగా లైగర్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ నిరాశపరిచిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు.

దానికోసం గతంలో ఆయన ఏర్పరచుకొని కొన్ని నియమాలను కూడా ఏర్పరచుకొని ఈ సినిమాను చేయబోతున్నారట. ప్రేమకథా సినిమాలను ఎంతో చక్కగా డీల్ చేసే హీరో అయినా శివనిర్వాన ఈ చిత్రాన్ని ఎంతో బాగా చేస్తున్నాడని ఇప్పటికే సినిమా పరిశ్రమ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. భారీ ఫ్లాప్ అందుకున్నా కూడా విజయ్ దేవరకొండకు సినిమా అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. నలుగురు ఐదుగురు దర్శకులు ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి లైన్లో ఉండడం విశేషం. 

వాస్తవానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాను విజయ్ దేవరకొండ చేయవలసి ఉంటుంది. ఆయన ఈ సినిమా ను పూర్తిగా పక్కన పెట్టేసారని చెబుతున్నారు. ఇకపోతే ఇప్పుడు ఆయనతో తదుపరి సినిమా చేయడానికి హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇంద్రగంటి మోహనకృష్ణ అలాగే ఫ్యామిలీ మెంబర్ దర్శకులు కూడా విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. మరి దీనిలో ఏది అధికారికంగా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: