అఖండ సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. టాలీవుడ్ సినిమా పరిశ్రమంలో యంగ్ హీరోగా మంచి క్రేజీ కలిగి ఉన్న రామ్ తో ఆయన తన తదుపరి సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఊర మాస్ చిత్రాలను చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే బోయపాటి శ్రీను తొలిసారి రామ్ లాంటి యువ హీరోతో సినిమా చేస్తూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో అందరిని ఎంతగానో ఆసక్తి పరుస్తుంది.

ఇటు రామ్ కూడా బోయపాటి శ్రీను తో చేయబోయే సినిమాపై ఎంతగానో అంచనాలు పెట్టుకున్నాడు. దానికి కారణం ఆయన గత రెండు మూడు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాయి. దాంతో ఒక భారీ విజయాన్ని అందుకోవాల్సిన సమయంలో బోయపాటి శ్రీను తో కలిసి సినిమా చేయడం ఆయనను ఎంతగానో ఆనందపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అన్న ఆతృతతో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తన లుక్ కోసం ఎంతో కసరత్తు చేస్తున్నాడట రామ్.

బోయపాటి శ్రీను కూడా ఒక వెరైటీ లుక్ ను డిజైన్ చేశాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు షూటింగ్ మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం యొక్క కథ ఏమై ఉంటుందన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది. సాక్ష్యం సినిమాలోని ఎక్కువగా రూపొందించే బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం ఎలాంటి కథను రెడీ చేశాడో అన్న ఆసక్తి అందరిలో ఉంది.  రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండడం విశేషం. తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలు పెట్టి వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉండడంతో రామ్ సినిమాను చేస్తున్నాడు ఇప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: