సినీ నటులకు అభిమానులే కొండంత అండ. వారి అభిమానం కొలవలేనిది. వారి సహకారం లేనిదే ఏ సినిమా కూడా హిట్ కాదని వారందరికీ తెలుసు. అందుకే వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం మామూలే.

ఇందుకు ఎవరు అతీతులు కారు. చిరంజీవి నుంచి చివరి వరకు ఎవరైనా అభిమానుల కోరిక తీర్చాల్సిందే. వారి అంచనాలకు అనుగుణంగా సినిమాలు తీయాల్సిందే. లేకపోతే నిరాశకు గురవుతారు. సినిమాల మీద ప్రభావం పడుతుంది. అందుకే వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంద అనటంలో ఆశ్చర్యం లేదు .

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించగా ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. దీంతో అభిమానుల కోలాహలం మొదలైంది. కృష్ణంరాజుకు చాలా ఇష్టమైన కనకమామిడి లో తన సొంత ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు ముగించారు. దీనికి అభిమానుల సందడి కూడా ఎక్కువగానే కనిపించింది. దీంతో వారి బాధలు అర్థం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వారి కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తుల ఉద్దేశాలు తెలుసుకున్న ప్రభాస్ చేసిన పనికి అందరు షాక్ అయ్యారు.

ఫామ్ హౌస్ కు చేరుకున్న అభిమానులకు మంచినీళ్లు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం సంచలనం కలిగించింది. కడచూపు చూడటానికి వచ్చిన అభిమానుల అవసరాలు గుర్తించి వారికి భోజన వసతి ఏర్పాటు చేయడంతో అందరు అవాక్కయ్యారు. ఎంతో దూరం నుంచి ప్రేమతో వచ్చిన వారికి ప్రభాస్ చేసిన ఏర్పాట్లు అందరికి నచ్చాయి. తమ అభిమాన హీరో ఇలా చేయడం అందరిలో ఉత్సాహం నింపింది. ఖాళీ కడుపుతో వచ్చిన వారికి అన్నం పెట్టడంతో వారు తృప్తిగా అంత్యక్రియలు వీక్షించారు.

 
అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి అప్పటికే అభిమానులు వేల సంఖ్యలో చేరుకున్నారు. ఫామ్ హౌస్ బయట ఉన్న అభిమానుల మధ్య కడసారి కార్యం నిర్వహించారు. పోలీసుల భద్రతల నడుమ పెదనాన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. చూసేందుకు వచ్చిన వారికి కూడా ఏ లోటు లేకుండా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశం అయింది. అశ్రునయనాల మధ్య ఉన్నా అభిమానులకు అండగా నిలవడం సంచలనంగా మారింది. ప్రభాస్ నిర్ణయానికి అందరు ఫిదా అవుతున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి . అభిమానులంటే వారికి ఎంత ఇష్టమో దీన్ని బట్టి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: