మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో తెరకెక్కు తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండగా ,  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో కీయారా అద్వానీ ,  రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సునీల్ , అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు .

మూవీ లో ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అంది స్తున్నాడు. ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య కనిపించ బోతున్నారు . ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది.

మూవీ లో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలకమైన సన్నివేశం కోసం మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మోహన్ లాల్ ని తీసుకోవాలి అని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్మూవీ ని తన పూర్వపు మూవీ ల మాదిరి అదిరి పోయే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న తెలుస్తుంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: