టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా ,  శ్రీ కార్తిక్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని దర్శకుడు శ్రీ కార్తీక్ టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యి మంచి మౌత్ టాక్ తో ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతుంది.

మూవీ లో అక్కినేని అమల ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి , వెన్నెల కిషోర్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని అఖిల్ రాబోతున్నట్లుగా చిత్త బృందం అనౌన్స్ చేసింది. కాక పోతే అక్కినేని అఖిల్మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చివరి వరకైన అఖిల్ వస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒకే ఒక జీవితం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిల్ రాలేదు.  తాజాగా దర్శకుడు శ్రీ కార్తీక్ అఖిల్ 'ఒకే ఒక జీవితం' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడానికి గల కారణాన్ని చెప్పు కొచ్చాడు.

ఒకే ఒక జీవితం మూవీ ని చూసి అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత ఆయన మామూలు మనిషి కావడానికి రెండు రోజులు టైమ్ పట్టింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఎమోషనల్ గా తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని భావించే అఖిల్ ఆ ఆలోచనను విరమించుకున్నాడు అని తాజాగా దర్శకుడు శ్రీ కార్తీక్ చెప్పాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: