మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టిన చిత్ర బృందం విడుదల చేసి సినిమాపై మంచి క్రేజీ పెంచుతుంది అని చెప్పాలి. విక్రమ్ కార్తి జయం రవి త్రిష ఐశ్వర్యారాయ్ శోభిత ధూళిపాళ్ల వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో క్రేజీ రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి.

భారత దేశ ప్రాచీన సంస్కృతిని అప్పటి నాగరికతను రాజుల యొక్క గొప్పతనాన్ని ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఆ విధంగా తమిళనాడు గొప్ప సామ్రాజ్యంగా వెలసిన రాజు కథను ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుండగా మొదట్లో దీనికి ఏమాత్రం బజ్ లేకపోవడం చిత్ర బృందాన్ని ఎంతగానో కలవర పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఒక్కసారిగా పెంచడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. 

రెహమాన్ సంగీతం సమకూర్చిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి సెప్టెంబర్ ఆఖరిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు పోటీగా ఏ పెద్ద సినిమా లేకపోవడం విశేషం. మణిరత్నం దర్శకుడుగా ఎలాంటి సినిమాలను రూపొందిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు దాకా ఎంతో మంచి సినిమాలను చేసి అగ్ర దర్శకుడుగా పేరుగాంచిన మణిరత్నం ఆఖరి గత కొన్ని రోజులుగా మంచి సినిమాలను చేయడం లేదు అన్న విమర్శలను ఎదుర్కొంటున్నాడు చాలా రోజుల తర్వాత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చేస్తున్న ఆయన ఏ స్థాయిలో దానితో ప్రేక్షకులను అనుభవిస్తాడో చూడాలి. ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో తారాగణంతో భారీ బడ్జెట్లో సినిమాను చేసిన దర్శకుడు కేవలం మణిరత్నం కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: