మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది.  ఈ సినిమాను వేసవి లో విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం దానికి తగ్గట్టుగానే ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి చేస్తుంది అని చెప్పాలి. షెడ్యూల్ పూర్తి కాగానే దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తూ ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుంది. ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమిళనాడు ప్రముఖ నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా  నటిస్తూ ఉన్నాడు ఈ మేరకు ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయి లోనే ఉన్నాయని చెప్పాలి.

అయితే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో అది ఎవరితో ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన తన తదుపరి సినిమా ను కన్నడ దర్శకుడు తో కలిసి చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఈ సినిమాను చేసిన తర్వాత ఈ దర్శకుడికి డిమాండ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కేజిఎఫ్ హీరో తో ఆయన త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.

 కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ రామ్ చరణ్ తో ఆయన సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అక్టోబర్లో మొదలు పెట్టబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయవలసిన రామచరణ్ ఆయన కోసం కొన్ని రోజులు ఆగాల్సి వస్తూ ఉండడంతో దానికంటే ముందు ఈ సినిమా చేయాలని చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయవలసి ఉంది. ఈ చిత్రం ఆగిపోయింది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా చేయవలసిన ప్లేస్ లో ఇంకొక సినిమాను చరణ్ మొదలు పెట్టడం దేనికి దారితీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: