కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఊహించని విధంగా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ రష్మిక గురించి పరిచయం అవసరం లేదు.

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకొని ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమా ఎంతో విజయవంతం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఈమె క క్రేజ్ మరింత పెరిగిపోయింది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ రావడమే కాకుండా ఏకంగా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ప్రస్తుతం వరుస బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన బాల్యం ఎక్కువ భాగం హాస్టల్లోనే గడిచిపోయిందని తెలిపారు.

 

తాను చిన్నప్పటినుంచి హాస్టల్ లోనే ఉండి చదువుకున్నానని హాస్టల్లో ఎప్పుడు తన చుట్టూ స్నేహితులు ఉండేవారు వారినే తన కుటుంబంలా భావించానని తెలిపారు.ఇక టీచర్ల పట్ల తనకు ఎంతో గౌరవం ఉండేదని వారిలో తన అమ్మని చూసుకున్నానంటూ ఈమె తెలియజేశారు. ఇక చదువు గురించి మాట్లాడుతూ తను స్కూల్లో ఉన్నన్ని రోజులు యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని అయితే ప్లస్ 2, డిగ్రీ చదివే సమయంలో తాను క్లాస్ టాపర్ గా ఉండేదాన్ని తెలిపారు.

 

ఇక తనకు మాథ్స్ అన్న బయాలజీ అన్న ఎంతో భయం అని అందుకే తాను ఇంటర్లో సీఈసీ తీసుకున్నానని ఈమె తెలిపారు. ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక తన బాల్యం గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పుష్ప 2 షూటింగ్ తో బిజీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: