ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సమంత అనేక సేవాకార్యక్రమాలు పిల్లలకోసం చేయడం అందరికీ తెలిసిన విషయం. అయితే నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత అనేక ఆశ్రమాలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఒక ఆశ్రమంలో సమంత ఈమధ్య ఒక హోమంలో పాల్గోన్నట్లుగా వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాస్తవానికి సమంత క్రిష్టియన్ నాగచైతన్యతో పెళ్ళి జరిగినప్పుడు హిందూ క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం వారిద్దరి పెళ్ళి రెండుసార్లు జరిగింది.


ఆతరువాత సమంత తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళడం ఒక అలవాటుగా మార్చుకుంది. ప్రస్తుతం చైతన్యతో ఆమె విడిపోయినప్పటికీ హిందూ మత సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె ఆలయాలకు వెళ్ళడం కొనసాగిస్తోంది. ఇలా ఆలయాలకు వెళ్ళడం వల్ల మనశ్శాంతి కలిగి తాను ఏమిటో తనకు అర్థం అయ్యేలా ఉంది అంటూ ఆమధ్య ఆమె కామెంట్స్ చేసింది.


ఆమధ్య ఈమె సికింద్రాబాద్ లోని వేదభవన్ లో ఆమె ఒక హోమంలో పాల్గొందని వార్తలు రావడమే కాకుండా దానికి సంబంధించిన ఫోటోలు కూడ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో సమంత ఏ దోష నివారణార్థం ఆమె హోమాలు చేస్తోంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత హైదరాబాద్ లోని కొన్ని ఆశ్రమాలకు భారీ విరాళాలు ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్రిష్టియన్ సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందూ మతం పై ఆలయాల పై ఆశ్రమాల పై సమంతకు పెరిగిపోతున్న ఆశక్తి వెనుక ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.


ఇది ఇలా ఉండగా సమంత బాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న స్పీడ్ ను చూసినవారికి ఆమె బాలీవుడ్ ను తన కార్యస్థానంగా మార్చుకుంటోందా అన్న సందేహాలు వస్తున్నాయి. జూనియర్ కొరటాల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న భారీ బడ్జెట్ మూవీలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నప్పటికీ ఆవిషయం ఇంకా అధికారికంగా ప్రకటింప పడలేదు..




మరింత సమాచారం తెలుసుకోండి: