ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చిత్ర బంధం చాలా అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా అన్వేషిస్తున్న సమయంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె, ఇమే నటిస్తోంది అంటూ పలు విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆలియా భట్ నటిస్తోందని వార్తలు రాగా.. మళ్లీ మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్ తీసుకురాబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక నటిస్తోందని వార్త కూడా వైరల్ గా మారుతుంది అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక గతంలో జాహ్నవి కపూర్ కూడా నటిస్తోందని వార్తలు వినిపించాయి.. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. ఎన్టీఆర్ 30వ సినిమాలో రష్మిక ఎంపిక చేసేందుకు కొరటాల శివ ఇటీవలే ఆమెను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక ఎన్టీఆర్ 30 వ సినిమాలో నటిస్తే.. మరింత ఈ సినిమాకి ఆకర్షణీయంగా ఉంటుందని కొరటాల శివ భావించడంతో ఆమెను తీసుకోబోతున్నట్లు.


అందుకు రష్మిక కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రేమ్యునరేషన్ విషయం మాత్రం డైరెక్టర్ కి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దాదాపుగా రూ.5 కొట్లు రూపాయల వరకు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు తమిళ్, తెలుగు భాషలో కూడా హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రంలో కూడా నటిస్తున్నది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం ఖచ్చితంగా విజయాన్ని చేకూరుతుందని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 30వ సినిమా గురించి చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: