యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే. ప్రస్తుతం హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు..మన యంగ్ హీరో రామ్...అయితే  ఇటీవల రామ్  'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.ఇకపోతే ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించడంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా  రిలీజ్ తరువాత ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

 ఇదిలావుంటే  ప్రస్తుతం రామ్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా బోయపాటి తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అయితే  ఈ సినిమా తరువాత రామ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే విషయంపై తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలావుంటే తాజాగా తమిళ హీరో శింబుతో కలిసి ఈ డైరెక్టర్ తెరకెక్కించిన 'ముత్తు' చిత్రాన్ని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్న సందర్భంగా గౌతమ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు.

అయితే గతంలోనే యంగ్ హీరో రామ్ పోతినేనితో గౌతమ్సినిమా స్టార్ట్ చేశాడు.ఇక  ఆ సినిమా కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఇక  కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలావుంటే  అప్పటినుండి రామ్‌తో తాను టచ్‌లోనే ఉన్నానని.. ఇటీవల రామ్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేసి వినిపించగా, దానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే ఈ సినిమా చేసేందుకు నిర్మాత స్రవంతి రవికిషోర్ ఎంతగానో సాయపడుతున్నట్లుగా గౌతమ్ తాజాగా వెల్లడించాడు. అయితే ఇక  మొత్తానికి రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికైతే ఓ క్లారిటీ వచ్చిందని చెప్పాలి.అయితే మరీ  ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: