కాగా నిఖిల్ నుండి తర్వాత రానున్న చిత్రాలలో 18 పేజెస్ మరియు స్పై చిత్రాలు ఉన్నాయి. 18 పేజెస్ ను సూర్యప్రతాప్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇతని నుండి ఇంతకు ముందు వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా వచ్చిన హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇప్పుడు కార్తికేయ 2 లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు మరియు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మళ్ళీ కొన్ని సీన్ లను రీ షూట్ చేస్తున్నారట. అందుకు కారణం మన డైరెక్టర్ సుకుమార్ అని సమాచారం. ఇటీవల ఈ సినిమా అవుట్ ఫుట్ ను చూసిన సుకుమార్ అంత హ్యాపీ గా లేరట.
అందుకే ఆయన సలహా మేరకు మళ్ళీ కొన్ని సీన్ లను రీ షూట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారట. ఇందుకు నిఖిల్ కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే ఇది షూట్ జరగనుంది. కాగా కార్తికేయ 2 హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి చూద్దాం నిఖిల్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది.