ఈ సినిమా గత వారమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో రన్బీర్ కపూర్ మరియు అలియా భట్ లు ప్రధాన పాత్రలు పోషించగా, మరికొన్ని ముఖ్య పాత్రలలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ లు నటించారు. ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ లను చూసిన ప్రేక్షకులు అంచనాలను భారీగా పెట్టుకున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమా మొత్తం కూడా గ్రాఫిక్స్ తో కూడుకున్నదే... అదే ప్రాణం. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ విషయంలో తగిన శ్రద్ద పెట్టలేదని క్లియర్ గా అర్ధమవుతోంది.
కాగా ట్రేడ్ వర్గాల ప్రకారం బ్రహ్మాస్త్ర ఇప్పటి వరకు రూ. 267.29 కోట్లను కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఉంది. ఇప్పటికే కలెక్షన్ లు తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 410 కోట్లతో నిర్మించిన బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 143 కోట్లు సాధించాల్సి ఉంది. ఒకవేళ ఇది కనుక జరగకపోతే మళ్ళీ బాలీవుడ్ లో పాత కథే అనుకోవాలి.