విజయ్
దేవరకొండ హీరోగా నటించబోయే తదుపరి
సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్క
సినిమా ప్రేక్షకులలో ఉంది. లైగర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ
హీరో ఇప్పుడు
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న
ఖుషీ సినిమాతో తొందర్లోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
సమంత కథానాయకగా నటిస్తున్న ఈ
సినిమా యొక్క తదుపరిస్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ
సినిమా తర్వాత విజయ్
దేవరకొండ ఎవరితో
సినిమా చేస్తున్నాడో తెలియక చాలామంది అభిమానులు అయోమయానికి గురి అవుతున్నారు.
కొంతమంది
మాస్ దర్శకుడైన
హరీష్ శంకర్ తో కలిసి ఆయన
సినిమా చేస్తున్నాడు అని చెబుతూ ఉండగా ఇంకొంతమంది లేదు అని వేరే దర్శకుల పేర్లు చెబుతున్నారు. ఏదేమైనా విజయ్
దేవరకొండ తదుపరి
సినిమా ఏమై ఉంటుందని కలవరపాటు ప్రేక్షకులలో కూడా ఇప్పుడు మొదలైంది అని చెప్పాలి.
సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ఇప్పటికే ఒప్పుకున్న విజయ్
దేవరకొండ దానిని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం
సినిమా పనులలో ఉన్న
సుకుమార్ దానిని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసి ఆ తర్వాత విజయ్
దేవరకొండ సినిమాను చేయబోతున్నాడు.
అయితే దానికంటే ముందు ఒక
సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న విజయ్
దేవరకొండ ఎవరితో సినిమాను చేస్తాడు చూడాలి. దాదాపుగా
హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ఆయన
సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేశాడట. లైగర్
సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్
దేవరకొండ ను సరైన మార్గంలో పెట్టే బాధ్యతను దిల్ రాజు తీసుకోవడం విశేషం. భారీ స్థాయిలో క్రేజీ ఉన్న ఈ హీరోతో సరైన
సినిమా చేస్తే తప్పకుండా అది భారీ
సక్సెస్ అవడం ఖాయం. మరి ఆ అవకాశాన్ని దిల్ రాజు ఉపయోగించుకుని మంచి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.