బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.అందులో ఆదిపురుష్ ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈ నెలలో అప్డేట్ వస్తుంది అని. మరో నెలలో వస్తుంది అని న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం గమనార్హం.
మరి తాజాగా మరోసారి ఈ సినిమా నుండి అప్డేట్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు టాక్. ప్రభాస్ ఢిల్లీ లో జరిగే దసరా వేసుకల్లో పాల్గొంటున్నాడు అంటూ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఈ దసరా వేడుకల్లోనే ఆదిపురుష్ టీజర్ కూడా వస్తుంది అని ఇప్పుడు సమాచారం అందుతుంది. త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ప్రకటన రానుందట.దీనిలో నిజమెంతో ముందు ముందు తెలియనుంది. ఇక ఈ సినిమా కోసం టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.