త్రివిక్రమ్ శ్రీనివాస్ చాల సెలెక్టివ్ గా కొందరి హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తాడు. అయితే ఇప్పుడు అతడి దృష్టి ఒక పురాణ గాధ పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. రానా తో గతంలో గుణశేఖర్ ‘హిరణ్యకశిప’ అన్న మూవీ తీయాలని చాల వర్క్ చేసాడు. ఈమూవీని త్రీడి ఫార్మెట్ లో తీయాలని గుణశేఖర్ కొన్నివేల డిజైన్స్ డ్రాయింగ్ లు వేయించి ఈమూవీ స్క్రిప్ట్ పై కూడ చాల కష్టపడ్డాడు అని అంటారు.


ఈమూవీని దగ్గుబాటి సురేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో వందల కోట్ల బడ్జెట్ తో తీయడానికి అప్పట్లో ముందుకు వచ్చారు అన్న వార్తలు కూడ వచ్చాయి. అయితే గుణశేఖర్ ఎంతో కష్టపడి స్క్రిప్ట్ తయారుచేసినా ఆస్క్రిప్ట్ పూర్తిగా సురేష్ బాబుకు నచ్చకపోవడంతో ఆమూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అంటారు. ఇప్పుడు ఆమూవీ ప్రాజెక్ట్ మళ్ళీ వార్తలలోకి వచ్చింది. ఈమూవీని దర్శకత్వం వహించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


త్రివిక్రమ్ మంచి భావకుడు మాత్రమే కాకుండా పురాణాల పై చాల గట్టిపట్టు ఉంది. ఎప్పటి నుండో అతడికి ఒక పౌరాణిక గాధను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీయాలని ఉంది అని అంటారు. ఇప్పుడు ఈవిషయాలను గ్రహించిన సురేష్ బాబు త్రివిక్రమ్ ను పిలిపించి ఆగిన ‘హిరణ్యకశిప’ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం అతడు సూత్రపాయంగా అంగీకరించడం జరిగింది అని వార్తలు వస్తున్నాయి.


ఈమధ్యనే గుణశేఖర్ అంగీకారంతో అతడు తయారుచేసిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ కు ఇవ్వడం జరిగిందని ఈ స్క్రిప్ట్ పై ఒకవైపు మహేష్ తో సినిమాలు చేస్తూనే త్రివిక్రమ్ తన టీమ్ తో వర్క్ చేయిస్తాడని అంటున్నాడు. ఈమూవీ మహేష్ మూవీ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత పట్టాలు ఎక్కే ఆస్కారం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. రానా కు ‘బాహుబలి’ తరువాత చెప్పుకోతగ్గ బ్లాక్ బష్టర్ హిట్ లేదు. ఇప్పుడు ఆలోటును త్రివిక్రమ్ తీరుస్తాడు అనుకోవాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: