ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆరవ సీజన్ కూడా మొదలయింది. ఇక ఈ క్రమంలోనే సెలబ్రిటీ లందరూ కూడా ఒకరికొకరు బాగా కలిసిపోయినట్లు తెలుస్తోంది.

ఇక అందరూ కూడా సిసింద్రీ టాస్క్ పూర్తయిన తర్వాత రాత్రి తమ లైఫ్ బేబీ తో ఉన్న అనుబంధం గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా తమ స్టోరీలను చెబుతూ అందరిని ఏడిపించేశారు. తన స్టోరీని హౌస్ మేట్స్ తో పంచుకొని అందరికీ కన్నీటిని మిగిల్చింది.. శ్రీ సత్య మాట్లాడుతూ.. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అమ్మకి గుండెపోటు వచ్చింది. ఆ టైంలో సూసైడ్ చేసుకుంటానని అనడం నా తప్పే అంటూ ఆమె ఎమోషనల్ అయిపోయింది.

 

అంతేకాదు తల్లిదండ్రులని ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదని, వారు ఏది చెప్పినా కూడా పిల్లలు మంచి కోసమే అని.. తప్పకుండా వినండి అంటూ అందరికీ సలహా ఇచ్చింది.. పిల్లలు చేసే పనులకు అమ్మానాన్నలకు తట్టుకునే శక్తి ఉండదు. సమాజానికి కూడా భయపడాల్సి ఉంటుంది.. అలా నేను చేసిన మిస్టేక్ వల్ల మా అమ్మ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చేర్చారు అప్పుడు ఎవరూ లేరు.. నేను నాన్న ఇద్దరమే ఉండాల్సి వచ్చింది . ఆ తర్వాత అమ్మను మంచం మీద చూసినప్పుడల్లా నాకు ఏడుపొస్తూనే ఉంటుంది . మా నాన్న ఒక్కరే మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు.

 
స్నానం చేయాలన్నా, డ్రెస్ మార్చాలన్నా, అన్నం పెట్టాలన్నా సరే అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు.. ఇక అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. నిజానికి నేను ఈ ఫీల్డ్ లో రాక ముందు నుంచే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమ్మని తలుచుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. అమ్మ మంచాన పడిందా అనిపిస్తుందని కూడా ఆమె ఎంతో ఎమోషనల్ అయింది. ఇక అర్ధరాత్రి వరకు తన హౌస్ మేట్స్ తో తన బాధను చెప్పుకొని మరీ కన్నీటి పర్యంతం అయింది. ఇకపోతే హౌస్ మేట్స్ షేర్ చేసుకున్న ఎమోషనల్ స్టోరీలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: