విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావుపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొంతకాలం క్రితం థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఈ మూవీ ఆధ్యాతం కామెడీతో తెరకెక్కడం తో ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా దక్కాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా గత కొంత కాలంగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇలా థియేటర్ లలో మరియు 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఎఫ్ 3  మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతోంది.

సినిమా సెప్టెంబర్ 19 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కాబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను జీ తెలుగు ఛానల్ సంస్థ ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ మరియు 'ఓ టి టి' ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఎఫ్ 3 మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: