టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకుడుగా భద్ర మూవీ తో తన కెరియర్ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో బోయపాటి శ్రీను కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మొట్ట మొదటి మూవీ తోనే మంచి క్రేజీ లభించింది. ఆ తర్వాత ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఏ మూవీ లోనా అయినా మాస్ సన్నివేశాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ప్రతి మూవీ లో కూడా అదిరిపోయే మాస్ సన్నివేశాలను జోడిస్తూ సినిమాలను తెరకెక్కిస్తూ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో బోయపాటి శ్రీను మాస్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

బోయపాటి శ్రీను పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరోగా అఖండ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో బోయపాటి శ్రీను టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన రామ్ పోతినేని తో ఒక మూవీ ని చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే రామ్ పోతినేని మూవీ కి సంబంధించిన కథ పనులను కూడా బోయపాటి శ్రీను ముగిసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని మూవీ కోసం బోయపాటి శ్రీను 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను ఇద్దరికీ కూడా ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: