నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో మరో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ,  బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ నుండి ఇప్పటికే మూవీ యూనిట్ టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా , వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్  ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  

కానీ ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఏ సినిమాకు టైటిల్ ని అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తేరక్కెక్కుతుండడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి మరో సలీడ్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ టీజర్ విడుదల తోనే ఈ మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: