ప్రస్తుతం   ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా హవా నే నడుస్తోంది. ఇక టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల సోషల్ మీడియా ద్వారా చాలామంది తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక అదృష్టం కొద్దీ కొంతమంది మాత్రమే వారి టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతూ ఉంటారు.అయితే ఇటీవల ఇలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు. ఇకపోతే ఈ టీవీ లో ప్రసరమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకు తనదైన శైలిలో మాస్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్న ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ గాజువాక డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.

అయితే  ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ అంటే ఆ చుట్టుపక్కల వారికి మాత్రమే తెలిసేది.  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ పర్ఫార్మ్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఇకపోతే ఈమె  ఒక్క డాన్స్ తో ఝాన్సీ ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే కాకుండా ఇతర ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా అవకాశాలు పొందింది.అయితే  ఈ క్రమంలో ఝాన్సీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ ఒక రోజుకి 5000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.

కానీ  ఇప్పుడు పల్సర్ బైక్ పాట వల్ల పాపులర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ఒక రోజుకి 50 వేల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఝాన్సీ తన ఉద్యోగానికి కూడా లాంగ్ లీవ్ పెట్టి ఇలా టీవీ షోలో పర్ఫార్మ్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు ఇకపై ఝాన్సీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా డాన్స్ మీదే దృష్టి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: