బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా , అమితా బచ్చన్ ,  నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

మూవీ హిందీ తో పాటు సెప్టెంబర్ 9 వ తేదీన తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ ని తెలుగు లో దర్శకుడు రాజమౌళి సమర్పించారు.  ఈ మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం , ఈ మూవీ ని తెలుగు లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుడు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో  11.09 కోట్ల షేర్ , 21.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి  రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.59 కోట్ల లాభాలను అందుకొని డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: