టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్ లు రావడం, ఒకటి రెండు సినిమాలు హిట్ కొట్టడం స్టార్ హీరోయిన్ అవ్వడం పక్క అని వార్త వైరల్ అవడం.. కట్ చేస్తే వరుస ప్లాప్ లతో కనుమరుగైపోవడం లాంటి సంఘటనలు సినీ పరిశ్రమకు మరియు ప్రేక్షకులకు అలవాటు అయిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కుర్ర హీరోయిన్ అందుకు రెడీ గా ఉంది. కర్ణాటక రాష్ట్రము నుండి వచ్చిన కృతి శెట్టి బేబమ్మ గా ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. దీనితో వరుస అవకాశాలు తనను చుట్టుముట్టాయి. ఆ తర్వాత నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమాలో నటించి మెప్పించింది.. అది కూడా సూపర్ హిట్ అందుకుంది.

ఆ వెంటనే బంగార్రాజు సినిమాతో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో నాగ చైతన్య హీరోగా నటించగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించాడు. ఇక అప్పటి నుండి కృతి శెట్టి కి టైం కలిసి రాలేదు. యువ హీరో రామ్ తో కృతి ది వారియర్ సినిమాలో నటించింది. రిసెంటుగా రిలీజ్ అయిన సినిమా నిరాశను మిగిల్చింది. ఇందులో తనకు అస్సలు స్కోప్ లేదని చెప్పాలి. సరిగ్గా అదే సమయంలో నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం విడుదల అయింది. కానీ ఇది కూడా కృతి కి మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

అలా కృతి కెరీర్ లో వరుస ప్లాప్ ల తర్వాత సుధీర్ బాబు మరియు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబోలో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ కోసం కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా పై విడుదలకు ముందు వరకు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర లేదనే వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఇంద్రగంటి మరియు సుధీర్ బాబు ల కలయికలో వచ్చిన సమ్మోహనం లాంటి కథే అయినా..అందులో ఉన్న సహజత్వం లోపించింది అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక కృతి శెట్టి పాత్ర లో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాను ఎంజయ్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక వరుసగా కృతి ఖాతాలో మరో ప్లాప్ మూవీ పడినట్లే. కృతి కెరీర్ కి ఇక ప్రమాద ఘంటికలే... ఇక తన చేతిలో రెండు మూడు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అవి కనుక పోతే ఇక టాలీవుడ్ లో తన కెరీర్ క్లోజ్ అయినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: