తాజాగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా వస్తున్న విషయం  మనందరికి తెలిసిందే.అయితే 'ఎన్టీఆర్‌ 30' (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇక గతంలో వీరిద్దరి కాంబోలో 'జనతా గ్యారేజ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలావుంటే  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరపుకోనుంది.కాగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఎన్టీఆర్‌ 30కి సంబంధించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే  హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇక  ఎన్టీఆర్‌ 30లో నటించనున్నారని ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. అయితే ముందుగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేరు వినిపించగా.. అలాంటిది ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.కాగా  రెమ్యునరేషన్‌ విషయంలో సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని ఇంకో వార్త కూడా వచ్చింది. అంతేకాదు హీరోయిన్ ఎవరనే ప్రకటన ఆలస్యమవుతున్న కొద్దీ రూమర్లు ఎక్కువవుతూనే ఉన్నాయి.ఇదిలావుంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎన్టీఆర్‌ 30లో హీరోయిన్‌గా నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఇటీవల రోజల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పటికే రష్మిక ను కలిసి కొరటాల శివ కథ చెప్పాడని, కథ ఆమెకు బాగా నచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇక 'సీతారామం' హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఎన్టీఆర్‌ 30లో హీరోయిన్ అని మరో వార్త తాజాగా తెరపైకి వచ్చింది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.ఇదిలావుంటే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెరకెక్కుతుంది.ఇక  ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే  ఎన్టీఆర్ 30కి రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.ఇదిలావుంటే  మరోవైపు 'కేజీఎఫ్' డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: