సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపుడు ఒకే లుక్‌లో కనిపించి కనిపించి బోర్ కొట్టిందే
అందుకే ఇపుడు చేస్తోన్న త్రివిక్రమ్ సినిమాతో పాటు చేయబోయే రాజమౌళి సినిమా కోసం కొత్తగా కనిపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

 
తెలుగు టాలీవుడ్ యువ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు యంగ్ హీరోలు ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారు. కానీ మహేష్ బాబు కొత్త లుక్‌లో కాకుండా నార్మల్ లుక్‌లోనే ఎక్కువ కనిపించారు.

 
పోకిరి, అతిథి, మహర్షిలో కొత్త లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఒక లుక్‌లో కంటిన్యూ అయిపోయారు. కానీ త్రివిక్రమ్ సినిమాలో మాత్రం మహేష్ బాబు సరికొత్తగా గడ్డంతో రఫ్ లుక్‌తో కేక పుట్టిస్తున్నారు.

 
దాంతో పాటు సరికొత్తగా దిగిన ఫోటోలను మహేష్ బాబు ఇపుడు అభిమానులతో షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. అందుకోసమే డిఫరెంట్ లుక్‌లో కనిపించడానికీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

 
ఇక త్రివిక్రమ్‌తో చేస్తోన్న ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాంతో పాటు 'అర్జునుడు' లేదా 'అసుర సంధ్య వేళలో' అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ఓ ఫైట్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

 
త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో నిన్ననే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.

 
మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్రం ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయమి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళిసినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

 
మహేష్ బాబు, రాజమౌళి చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

 
అంతేకాదు దక్షిణాఫ్రికాకు చెందిన విల్బర్ స్మిత్‌ పెద్ద అభిమానులం అంటూ చెప్పారు. ఆయన రాసిన కథ స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నట్టు జక్కన్న చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు. మొత్తంగా మహేష్ బాబు.. వరుసగా త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల కోసం ఇప్పటి నుంచి కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: