సినిమాల ఎంపిక విషయంలో ప్రస్తుతం ఉన్న హీరోలు సైతం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కథలు ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథ బలంగా ఉంటేనే సినిమాలను చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇక ఇదే పద్ధతిని ప్రస్తుతం ఫాలో అవుతున్నాడు యువ హీరో సుదీర్ బాబు. సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం నిన్నటి రోజునా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇంద్ర గంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు సరసన మొదటిసారిగా కృతి శెట్టి నటించింది.


ఇక  సుధీర్ బాబు, కృతి శెట్టి కి సక్సెస్ లేక చాలా సతమతమవుతున్నారు దీంతో ఈ సినిమాకు మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల ముందు వరకు ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అలా ఒక ఇంటర్వ్యూలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బ్రహ్మాస్త్ర సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చిందని తెలియజేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ,అలియా భట్ కలిసి నటించారు.


ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమా కూడా విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక హీరో సుధీర్ బాబుకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే అప్పటికే కొన్ని సినిమాలతో కమిట్ అవ్వడం వల్ల డేట్స్ ఖాళీగా లేక ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించాలని తెలియజేశాడు. అయితే ఆ చిత్రంలో ఏ పాత్ర అనే విషయం మాత్రం చెప్పలేదు సుదీర్ బాబు.. కేవలం తను ఇతర ప్రాజెక్టులకు బిజీగా ఉండడం వల్లే ఈ సినిమాలో నటించలేకపోయానని తెలిపారు. ఇక గతంలో కూడా టైగర్ శ్రాష్ నటించిన భాగీ చిత్రంలో కూడా సుదీర్ బాబు విలన్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: