డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప తో రష్మిక మందన్నా (Rashmika Mandanna) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయింది


పాన్ ఇండియా లెవల్లో పుష్ప సృష్టించిన అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మరోవైపు సాంగ్స్ సైతం నెట్టింటిని షేక్ చేశాయట.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ నార్త్ ఆడియన్స్‏ను కట్టిపడేసింది. పుష్పరాజ్ మేనరిజం.. లుక్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏కు అందరూ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత హిందీలో రష్మికకు వరుస ఆఫర్లు అయితే క్యూ కట్టాయి. గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన గుడ్ బై ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె యానిమల్ చిత్రీకరణలో పాల్గోంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన నేషనల్ క్రష్.. ఫోటోగ్రాఫర్లతో ముచ్చటించింది. అందు లో ఆమె గుడ్ బై ట్రైలర్ గురించి మాట్లాడింది.


సెప్టెంబర్ 16న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన రష్మిక.. అక్కడున్న ఫోటోగ్రాఫర్లతో మాట్లాడిందట.. అయితే ఆమె ఇంగ్లీష్‏లో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో వారు ఆమెను హిందీలో మాట్లాడమని కోరారట.. దీంతో ట్రైలర్ చూశారా అంటూ హిందీలో మాట్లాడటం ఆమె స్టార్ట్ చేసింది. అంతేకాకుండా తప్పకుండా చూడాలని కూడా కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రియాల్టీ క్యూట్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన గుడ్ బై చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 7న ఈ మూవీ విడుదల కానుందట..మరి చూడాలి ఆ చిత్రం తనకి ఎలాంటి విజయం అందిస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: