నిఖిల్ ‘కార్తికేయ 2’ తో 100 కోట్ల క్లబ్ లో చేరతానని కలలో కూడ ఊహించుకుని ఉండడు. ఇప్పుడు ఈమూవీ ఇచ్చిన సూపర్ హిట్ జోష్ ను కొనసాగించాలి అంటే నిఖిల్ నుంచి విడుదల కాబోయే తదుపరి సినిమాలు కనీసం ఫ్లాప్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ టెన్షన్ నిఖిల్ ను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


ప్రస్తుతం నిఖిల్ దృష్టి తన నుంచి వెంటనే రాబోతున్న ‘18 పేజెస్’ ‘స్పై’ మూవీల పై ఉంది. సుకుమార్ రచనలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘కుమారి 21 ఎఫ్ ఫేమ్’ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ విడుదలకు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు నిఖిల్ కు పెరిగిన క్రేజ్ రీత్యా ఈమూవీ స్క్రిప్ట్ లో చాల మార్పులు చేసి తిరిగి రీ షూట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


దీనికి కారణం ఈమూవీకి కథను అందించిన సుకుమార్ ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈమార్పులు నిఖిల్ అంగీకారంతో జరుగుతున్నాయి అని అంటున్నారు. దీనికితోడు ‘కార్తికేయ 2’ తరువాత మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కడా ’18 పేజెస్’ గురించి ప్రస్తావించక పోవడంతో హడావిడి చేస్తున్న ఈవార్తలకు మరింత బలం చేకూరింది అని అంటున్నారు.


ఈమధ్య అల్లు కాంపౌండ్ కాలంలో కాంపౌండ్ నుండి వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. భారీ అంచనాలతో విడుదల అయిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఫెయిల్ కావడంతో అల్లు కాంపౌండ్ షాక్ లో ఉంది అని అంటున్నారు. దీనితో తమ సంస్థ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా మేకింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్న నిర్ణయంతో ’18 పేజెస్’ రీషూట్ జరుగుతోంది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఏది ఏమైనా ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ మరో ఫ్లాప్ చూడకూడదు అన్న టెన్షన్ పెరిగింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: