టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్.చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రం విడుదల కావడం జరిగింది. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా పరాజయం పాలైన విషయం అందరికి  తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాపై విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు.అయితే కానీ ఈ సినిమా చివరకు ఫ్లాప్ అయ్యింది.

 ఇక ఈ సినిమా పరాజయంపై ఇప్పటికే రకరకాల విశ్లేషణలు సాగాయి. ఇదిలావుంటే ఇక తాజాగా ఈ సినిమా పరాజయాన్ని ఆర్జీవీ తనదైన శైలిలో విశ్లేషించారు.అయితే  ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ దూకుడు స్వభావం కూడా లైగర్ పరాజయం పాలు కావడానికి ఓ కారణమని నేను భావిస్తున్నాను.ఇక  కరణ్ జోహార్ పై జనాలకు ఉన్న కోపం కూడా మరో కారణం.అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ జనాలకు కరణ్ జోహార్ పై కోపం విపరీతంగా పెరిగిపోయింది. ఇక అందుకే అప్పటి నుంచి ఆయన సినిమాను బాయ్ కాట్ చేస్తూ వస్తున్నారు.

అయితే సహజంగా తెలుగు హీరోలు చాలా వినయంగా ఉంటారు. ఇకపోతే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.అంతేకాదు  వారి ప్రవర్తనను బాలీవుడ్ ప్రేక్షకులు గమనించారు.ఇక ఈ వినయం బాలీవుడ్ హీరోల్లో ఉండదు.ఇకపోతే  అందుకే వారికి సౌత్ హీరోలు నచ్చారు. అయితే కానీ విజయ్ దేవరకొండ ప్రవర్తన స్టేజి మీద వింతగా ఉంటుంది.ఇక  ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొన్ని వింత చేష్టలు చేస్తుంటాడు.కాగా  విజయ్ ప్రవర్తన బాలీవుడ్ జనాలకు నచ్చి ఉండకపోవచ్చు' అని ఆర్జీవీ పేర్కొన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: