ఇటీవల తెలుగు ఓటీటీ ఆహా  సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని నిర్వహించి మంచి సక్సెస్ ని దక్కించుకుంది. అయితే ఆ కార్యక్రమం సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఓంకార్ సారథ్యం లో భారీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే డాన్స్ ఐకాన్ పేరుతో ఆహా వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు భారీ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం కి ఒక జడ్జ్ గా రమ్యకృష్ణ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పలు పెద్ద సినిమాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 

అయితే ఇలాంటి సమయంలో ఒక డాన్స్ కార్యక్రమానికి ఓకే చెప్పడం అనేది చాలా పెద్ద విషయం.ఇక  ఆమె ఈ డాన్స్ కార్యక్రమానికి ఓకే చెప్పడానికి భారీ పారితోషకమే కారణం అంటూ సమాచారం అందుతుంది. అయితే ఒక్కొక్క ఎపిసోడ్ కి ఆమె దాదాపుగా 4.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ అందుకుంటుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక  ఈ మధ్య కాలంలో ఏ డ్యాన్స్ కాంపిటీషన్ జడ్జికి కూడా ఈ స్థాయి పారితోషికం ఇస్తున్న దాఖలాలు లేవు. కాగా హిందీ లో ప్రసారమవుతున్న డాన్స్ కార్యక్రమాలకు కూడా జడ్జిలు ఈ స్థాయిలో పారితోషికం ను అందుకోవడం లేదు.

ఇక  దాంతో రమ్యకృష్ణ రికార్డ్ అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు సోషల్ మీడియాలో ప్రస్తుతం డాన్స్ ఐకాన్ గురించి ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.అయితే  చాలా విభిన్నంగా ఈ డాన్స్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.ఇక  డాన్స్ కార్యక్రమాన్ని హాలీవుడ్ డాన్స్ కార్యక్రమాల స్థాయిలో నిర్వహిస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే డాన్స్ ఐకాన్‌ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అందులో రమ్యకృష్ణ ఎనర్జీ చూస్తే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.అయితే  ఆమె భారీ పారితోషికానికి న్యాయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: