ప్రముఖ నటుడు సాయికిరణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా సాయికిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

సాయికిరణ్, లయ ప్రేమించు సినిమాలో కలిసి నటించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సాయికిరణ్ లయ పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయికిరణ్ మాట్లాడుతూ లయతో పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లయకు, నాకు మధ్య ప్రేమ ఏం లేదని అయన తెలిపారు. చూడటానికి జోడీ బాగుందని పెళ్లి జరిగితే బాగుంటుందని పేరెంట్స్ అనుకున్నారని సాయికిరణ్ చెప్పుకొచ్చారు. అయితే మా ఇద్దరికీ జాతకాలు కుదరలేదని అందుకే పెళ్లి విషయంలో పేరెంట్స్ డ్రాప్ అయ్యారని అన్నారు.

అంతకు మించి మా ఇద్దరి పెళ్లి జరగకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదీ లేదని సాయికిరణ్ పేర్కొన్నారు. మేము కూడా చేసుకుంటామ ని అనుకున్నామని కానీ జరగలేదని సాయికిరణ్ చెప్పుకొచ్చారు.

నేను, లయ ఇప్పటికీ ఫ్రెండ్స్ లా ఉన్నామ ని సాయికిరణ్ తెలిపారు. ఈటీవీ వాళ్లది ఇంద్రజిత్తు అనే సినిమా లో కూడా మేమిద్దరం చేశామ ని సాయికిరణ్ చెప్పుకొచ్చారు.
పేరెంట్స్ అనుకున్నారని సెట్ కాలేదని నేను జాతకాలను బలంగా నమ్ముతానని ఆయన అన్నారు. నేను శివుడిని ఎక్కువ గా నమ్ముతాన ని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో శివుడే గాడ్ ఫాదర్ అని సాయికిరణ్ అన్నారు. సాయికిరణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సాయికిరణ్ లయ పెళ్లి జరిగి ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లయ ప్రస్తుతం సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సాయికిరణ్ కు యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: