ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలను చూస్తుంటే ఆచితూచి జాగ్రత్తగా ముందడుగులు చేస్తున్నట్లే ఉంది. అయన మాత్రమే కాదు చాలామంది హీరో లు ఈ విధంగా చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండను .. ఆయన అభిమానులను 'లైగర్' సినిమా ఫలితం చాలా నిరాశ పరిచింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఈ విధంగా అయిపోవడం నిజంగా ఎంతో నిరాశపరిచింది. అయితే ఆ పరాజయం ఎవరిని నిరుత్సాహపరచలేదు. ఆల్రెడీ అంతకుముందు ఆయన ఖాతాలో రెండు ఫ్లాపులు ఉన్నాయి.

అందువలన సాధ్యమైనంత త్వరగా ఒక హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అయితే లైగర్ ఫ్లాప్ అవడం కొంత నిరాశపరిచింది. అందుకోసం అనుకున్న సమయానికి 'ఖుషి'ని తెరపైకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన.  డిసెంబర్ లో ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా సమంత అలరించనుంది.  అయితే ఆమె ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరగకపోవడానికి కారణమ్ అవుతుంది అనడం విజయ్ అభిమానులను నిరాశపరుస్తుంది.  

ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ డేట్ మారకూడదనేది విజయ్ దేవరకొండ ఆలోచన. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండసినిమా చేస్తూనే తన తదుపరి సినిమాలను గురించి కూడా ఆలోచిస్తున్నారు. చాలా రోజులుగా అయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అన్నారు. అయన లేటెస్ట్ సినిమాఅమ్మాయి గురించి చెప్పాలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆయనతో చేసే సినిమా కాస్త పెండింగ్ లో పడింది. అసలే ఫ్లాప్ లలో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇలాంటి రిస్క్ లు తీసుకోవద్దని హిట్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: