టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన 'అఖండ' మూవీ సూపర్ సక్సెస్‌ సాధించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది.దీంతో అదే ఊపులో మరో మాస్ సినిమాకు కమిటై నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.మరో టాలెంటెడ్ మాస్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేనితో కమిటైన బాలకృష్ణ NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ మాస్ మసాలాతో ప్రేక్షకుల ముందుకొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి కన్నుల పండగ కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన అప్ డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాయి.ఈ నేపథ్యంలో ఈ మూవీ థియాట్రికల్ రైట్స్ గురించిన ఓ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ డీల్ వివరాలు చూసి షాకవుతున్నారు జనం.


పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ హక్కుల కోసం పోటీ పెరిగిందట.ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.మరీ ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం టాప్ ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారట. ఒక టాప్ ప్రొడ్యూసర్ ఈ హక్కుల కోసం ఏకంగా 18 కోట్లు ఆఫర్ చేసినట్లు ఓ న్యూస్ బయటకొచ్చి చక్కర్లు కొడుతోంది.గతంలో 'అఖండ' మూవీ నైజాం హక్కులను దిల్ రాజు 10.50 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో పోల్చి చూస్తే ఇప్పుడు గోపీచంద్ తెరకెక్కించే సినిమాకు డిమాండ్ బాగా పెరిగిందని అర్థమవుతోంది. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాల కృష్ణ సినిమాలకు ఈ రేంజ్ డిమాండ్ ఉండటం నందమూరి అభిమానవులకు కిక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: