సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతోంది . ఈ మూవీ షూటింగ్ ని ఆగస్టు లో ప్రారంభించ నున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కానీ కొన్ని అధికారి కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ని ఆగస్ట్ నెలలో ప్రారంభం కాలేదు.

తాజాగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. తమన్మూవీ కి సంగీతాన్ని అందించ నున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ అని ప్రకటించ కపోయినప్పటికీ ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ని భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మహేష్ బాబు ఈ మూవీ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది వరకే మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి.  వీరిద్దరూ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: